కలియుగంలో అన్నమే దేవుడు . అన్నానికి ఆదిస్థాన దేవత సాక్షాత్ శివుని భార్య ఆయెన శ్రీ మాత అన్నపూర్ణిశ్వరి
మనం దేవాలయాలకు వెళ్లి దేవునికి పూజా ,అర్చన చేయీoచిన తరువాత భయటకు వచ్చేడప్పుడు చిత్రాన్నం ,పెరుగన్నం , తదితర ప్రసాదాలను పంచుతారు .ఎందుకని ?
ఎ సమయంలో ఎ అన్నప్రసాదాన్ని దేవునికి అర్పించి ,పూజ చేసిన ఫలితం ఎ విధంగా ఉంటుందో చూద్దాం
చాల రోజుల నుంచి మీరు తలచిన పనులు పూర్తి కావు .ఆ సమయంలో మనం అన్నదానం చేయీస్తం
తమ కోరిక నెరవేరిన తక్షణమే అంటే ఉదాహరణకు పెళ్లి నిశ్చయం అయినప్పుడు ,శాశ్వత ఉదోగ్యం లబించినప్పుడు తదితర సమయంల్లో దేవునికి బెల్లం అన్నం నేవేద్దంన్ని చేయీoచాలి .దేవాలయంలో మీకు బెల్లం ప్రసాదం లబించినట్ట్లేయీతే మీ పనులన్నీ నెరవేరుతాయి .
ఎవరి వివాహానికి ఎంతమంది అబ్బాయులు /అమ్మాయులు వచ్చిన వివాహం కుదరక దోషాలు ఉంటి అటువంటి వారు దేవునికి చిత్రాన్నం ,పులిహొర అన్నం దేవత అలయంలో పంచినట్లేతే కష్టాలు పరిహారం ఆయె మంగల్ల్యా దోషాన్ని తొలగిస్తుంది .వివాహ జేవితం సుఖకరంగా మారుతుంది .చిత్రాన్నని,పులిహొరను వివాహం అయిన వారు తేoటే అన్ని గృహ కలహాలు తొలగిపోతాయి .మరోసారి గొడవలు జరగవు
వ్యాపారంలో నష్టాన్ని అనుభవిస్తున్నవారు దేవునికి పెరుగన్నం నైవేద్య్యం చేయీoఛి పంచితే వ్యాపారంలో అధికలాభం కలుగుతుంది
వ్యాపారంలో నష్టాన్ని అనుభవిస్తున్నవారు ...ఎవరికైనా నగదును ఇచ్చిన తరువాత డబ్బు వెనక్కి పొందలేక పోయినవారు .దేవునికి పెరుగన్నం నైవేద్య్యంగా పెట్టి అందరికి పంచితే నగదు వ్యవహారాలు చక్కబడి వ్యాపారం బాగా వృద్ది చేoదుతుంది .మీరు ఇచ్చిన రుణం మీ చేతికి అందుతుంది .దేనితో ఎటువంటి కలహాలు తలేత్తవు .ఒక వేళ కలహం జరిగినా తరువాత స్నేహితులైపోతారు
విద్యాబ్యాసాన్ని చేస్తున్న విద్యార్ధులు/విద్యార్దునులు చదివే సమయంలో ఎంత చదివిన మరచిపోతుంటే ,చదివే సమయంలో నిద్రలాగా వస్తుంటే ,పరీక్షా సమయములో అనారోగ్యానికి గురి అయెతే ,ఇంట్లో చదివేటప్పుడు ప్రశ్నలకు సమాధానం చేప్పి పరీక్షలో రాయకపోతే అటువంటి వారు బుదవారం రోజు దేవునికి(మధ్యాహ్నం )పెసరు పప్పుతో చేసిన పొంగలిని చేసి నైవేద్య్యంగా పెట్టి అందరికి పంచి తానుకూడా తెంటే మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది .అలాగే ఉన్నత విద్యాబ్యాసంతో అధిక మార్కులుతో ఉత్తిఱ్ఱాతా సాదిస్తారు
ఎవరింట్లో అయెతే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో ,ఎవరింట్లో అయెతే పితృశాపం ఉంటుందో ,ఎవరింట్లో అయెతే అకాల మరణాలు ఎక్కువుగా సంబవిస్తూ ఉంటాయో ,ఎవరింట్లో అయెతే పెద్దల కలలోకి వస్తుంటారో .ఎవరింట్లో అయెతే దెయ్యం ,భూతం ,పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నని నైవేద్య్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో ,ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి .దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతయి
నేతి అన్నం
ఇంట్లో ఆరోగ్యం తక్కువుగా ఉన్నవారికీ
ఇంట్లో ఎవరికో ఒకరికి రోగాల భాద ఉన్నవారికి
దీర్గకాలంగా రోగాలతో సమస్య్యలు ఎదుర్కుంటున వారు
సాయంత్రాలు తలనొప్పి వస్తున్నవారు
వైద్ద్యంతో నయంకానీ రోగాలు ఉన్నవారు
అనారోగ్యంగా ఉన్నవారి పేరిట దేవునికి గురువారం రోజు నేతి అన్నాన్ని నైవేద్య్యం చేయిoఛి ప్రసాదాన్ని అందరికి పంచి తాము కూడా తెంటే అన్ని రకాల రోగాలు నివారణ అయి ఆయస్షు వృద్ది చేoదుతుంది
ఇంట్లో గర్బినులు ఉన్నప్పుడు వారి పేరిట దేవునికి పూజ చేయిoఛితే అప్పుడు ఆ గర్భిణి పుట్టబోయ పిల్లలకు అన్ని రకాల రోగాల నుంచి విముక్తి పొందుతారు .తల్లి బిడ్డలు ఇద్దరికీ ఆరోగ్యభాగ్యం లబిస్తుంది .ఆయస్షు వృద్ది చేoదుతుంది
పాయస అన్నం
జీవితంలో బాగా బతికి ఎవరికీ సహాయం చేయకుండా ఉండి చివరకు తామే కస్థాలకు గురిఅవుతారు .ఒక్కరి వల్ల ఇంటి వారందరూ కష్టాలు అనుభవిస్తారు .ఇటువంటి సంధర్భంలో దేవునికి బియ్యం ,శనగపప్పు పాయసం లేదా పాయసంలో కొద్దిగా అన్నాన్ని వేసి దేవునికి నైవేద్య్యం చేయీoఛి పంచితే తిరిగి భాగ్యవంతులు అవుతారు
దేవునికి పండ్లు బెల్లం పాయసం చేయిoఛి శ్రీమంత బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని దరిద్రాలు తొలగిపోతాయి .త్వరలో సిరివంతులు అవుతారు
కూరగాయల అన్నం (పలావ్ )
ఎవరు ఎప్పుడు భయపదుతూ ఉంటారో
జాతకం ప్రకారం ఎవరికీ ప్రాణాపాయం ఉంటుందో
ఎవరికీ గండాలు ఉన్నాయనీ తెలిసి ఉంటుందో
ఎవరికీ ప్రమాదాలఫై ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో
ఎవరైతే కింద పదే పదే పడుతుంటారో
ఇటువంటి వారు దేవాలయంలో దేవునికి కూరగాయలు వేసి చేసెన అన్నం అంటే పలవు అన్నన్ని నైవేద్య్యంగా పెట్టి అందరికి పంచితే ఈ దోషాలు అన్ని తొలగిపోతాయి
గోధుమ రవ్వ పాయసం
ఎవరికీ సంతానం ఉండాదో
ఎవరికీ గర్భం నిలువదో
ఎవరికీ గర్భస్రవం అవుతుంటుందో
ఎవరికితే పిల్లలు పుట్టిన తరువాత బతకరో
ఇటువంటి వారు గురువారం /శుక్రవారం రోజు గోధుమ రవ్వ పాయసాన్ని దేవునికి 10 వారాల పాటు పూజాచేసి ప్రసాదాన్ని పంచి ,తాము కుడా తేంటే ఫైనా తెలిపిన దోషాలు తొలగి మంచి సంతానం కలుగుతుంది
రవ్వతో చేసిన గంజి
ఎవరైతే చాలా లావుగా ఉండి సన్నగా అయేందుకు ఇష్టపడతారో
ఎవరికితే రజస్వల సమస్స్యలు ఉంటాయో
ఎవరి వివాహం అయెతే వాయిదా పదుతూ పోతుందో
ఎవరికి రక్తపోటు ,హైపర్ టెన్షన్ ఉంటాయో
ఎవరితే తమ బరువును తగించుకోవడానికి ఇష్టపడతారో
తదితర ఇబ్బందులు ఉన్నవారు దేవి ఆలయానికి మంగళవారం రవ్వతో చేసీన గంజిని దేవతకు నైవేద్య్యం చేసి పంచాలి .దాన్ని వారు తినకూడదు
బెల్లం అన్నం
బెల్లం అన్నని శ్రీ మహాగంపతికి 22 రోజులు పూజా చేసి నైవేద్య్యంగా పెట్టిన తరువాత పశువులకు పెట్టి అనంతరం బెల్లం ప్రసాదాన్ని భుజిస్తే మేరు కోరిన కోరికలు త్వరగా నేరవెరుతు ఎక్కువ లాభాన్ని పొందుతారు
నవగ్రహ హోమల్లో మరియు పూజల్లో ఉండే బెల్లం అచ్చును ఇంటివారు పూజాచేయిoచిన భాహ్మణులు పానకం చేసుకొని త్రాగితే అన్ని పనులు త్వరగా అవుతాయి
బెల్లం అన్నని సరస్వతి దేవికి నైవేద్య్యంగా పెట్టి చిన్న పిల్లలకు పంచితే పనులన్నీ నేరవేరుతాయి .విద్యబ్యాసంలో ఎక్కువ మార్కులు పొంది జ్ఞాపక శక్తీ వృద్ది చేoదుతుంది
శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి బెల్లాన్ని నైవేద్య్యంగా ఉంచి దంపతులకు ప్రసాదంగా ఇచ్చి ఇంట్లో వారందరు ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎటువంటి దుస్ట్ట మంత్రాలూ మీఫై పని చేయవు
నవగ్రహాలకు తాంబులంలో బెల్లాన్ని పెట్టి పూజ చేసి బెల్లాన్ని నైవేద్య్యంగా ఉంచి తాంబులంలో బెల్లం అన్నాన్ని పెట్టి దానం చేస్తే మీ కష్ట్టలు త్వరలో తొలగిపోతాయి
శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి బెల్లం అన్నం నైవేద్య్యంగా పెట్టి తింటే దాంపత్యంలో ఉండే అన్ని రకాల గొడవలు చాలా త్వరగా తొలగిపోతాయి
శ్రీ గణపతి హోమంలో పురహుతికి /హోమానికి బెల్లం అన్నాన్ని వేస్తె హోమ క్రతువు ఉద్దేశ్యం త్వరగా నెరవేరుతుంది
శ్రీ ధన్వంతరి హోమంలో బెల్లం అన్నంతో హోమాన్ని పూర్తి చేస్తే సర్వ రోగాలు నయం అవుతాయి
శ్రీ సూర్యనారాయణ దేవునికి బెల్లం అన్నన్ని నైవేద్య్యం చేసి ప్రసాదాన్ని తింటి మీకు అన్ని రకాల నేత్ర రోగాలు ,హృదయ రోగాలు ,చర్మ రోగాలు చాల త్వరగా తొలగిపోతాయి
రాహుకాలంలో చేసే పూజ ,కొన్ని దేవతల పూజల్లో బెల్లం నైవేద్య్యంగా పెట్టి దానం చేస్తే మీఫై ప్రయోగించిన అన్ని రకాల మంత్రిక శక్తులు ,దిష్టి త్వరగా తొలగిపోతయి
శ్రీ మహాలక్ష్మి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్య్యంగా పెట్టి తాoబులంతో సహా దానం చేస్తే శ్రీమంతులు కావటంతో పాటు లక్ష్మి అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది
వ్యాపారస్తులు శుక్రవారం పూజకు బెల్లం అన్నని చేసి తాoబులంతో బెల్లం అన్నని దానం చేస్తే వ్యాపారం పెరిగి ఎక్కువ లాభం వస్తుంది
పెరుగన్నం
కులదేవతలకు పెరుగన్నం నైవేద్య్యంగా పెడితే మీ ఇంటిలో ఉన్న అధికమైన ధన ప్రాప్తి కలుగుతుంది
శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజను చేసి పెరుగాన్నని నైవేద్య్యంగా ఉంచి తాంభూలంతో పెరుగాన్నంని దానం చేస్తే మీ ఇంటిలో దనవృద్ది జరుగుతుంది
సిద్ది వినాయక స్వామిని స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సమయములో పెరుగన్నం నైవేద్య్యంగా చేసి తిన్న దానం చేసిన మీ ఇంటిలో ఎప్పుడు ప్రశాంతత ,శాంతి ,సంతోషం నెలకొంటాయి
ఎ దేవునికి పెరుగన్నం,పచ్చి మిరపకయ ,ఎండు మిరపకాయ వేసి నైవేద్య్యం పెడితే ...ఇంట్లో ఎప్పుడు గొడవలు ,రోగాభాద ,అప్పులభాద ,శత్రువుల భాద ఎక్కువ అవుతాయి
శనివారం రోజు కులదేవతలకు పెరుగన్నం నైవేద్య్యంగా పెడితే వ్యాపారంలో ,ఇంటిలో అప్పుల భాదలు చాల తగ్గుతాయి
శనివారం రోజు స్త్రీలు పళ్ళెంలో అరటి ఆకును పెట్టి దానిఫైనా పెరుగన్నం పెట్టిపళ్ళెంతో సహా తాంభూలంతో కలిపి దానం చేస్తి మీకు ఉన్న అన్ని రకాల మోకాళ్ళ నొప్పులు ,ఎముకుల సమస్స్యలు ,గడ్డలు ,అల్సర్లు త్వరగా నయం అవుతాయి
అమావాస్య రోజు మహాలయ పక్షాల సమయంలో పెరుగన్నం దానం చేస్తి అన్ని పితృ శాపాలు తొలగిపోతాయి
పెరుగాన్ననికి దానిమ్మ పండు గింజలను కలిపి కులదేవతలకు నైవేద్య్యం చేసి దానం చేస్తే మీకు శత్రువుల భాధ తొలగిపోయి తేజస్సుతో జేవిస్తారు
పెరుగాన్ననికి ఎండు ఖర్జూరాన్ని కలిపి కులదేవతలకు నైవేద్య్యం చేసి దానం చేస్తే మీకు ఎప్పుడు డబ్బుకు సమస్స్య రాదు .శ్రీమంతులుగా జేవిస్తారు
పెరుగాన్ననికి పచ్చి కొబ్బరి వేసి కలిపి శ్రీగణపతికి లేదా కుల దేవతకు నైవేద్య్యం పెట్టి అనంతరం తాoభులంతో కలిపి దానం చేస్తే మీకు ఎప్పుడు పేదరికం రాదు .అప్పుల భాద తొలగిపోతుంది
పెరుగాన్ననికి తేనే వేసి శ్రీ విష్ణు సహస్ర నామం లక్ష్మి సహస్రనామం పటించి పూజాచేసి దంపతులకు పెరుగన్నం దానం చేస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యభాగ్య్యం భాగుంటుంది .
పెరుగాన్ననికి మిరియాల పొడి వేసి కలిపి శ్రీ సుబ్రమణ్య స్వామికి నైవేద్య్యం చేసి దానం చేస్తే మీ సమస్త చర్మ వ్యాధులు త్వరగా తొలగిపోతాయి
చిత్రాన్నం
చిత్రాన్నం దేవికి నైవేద్య్యం చేసి సుమంగళిలకు శుక్రవారం దానం చేస్తే మాంగల్య దోషాలు తొలగిపోతాయి
శ్రీ లక్ష్మి నారాయణ దేవుడిని పూజించి నైవేద్య్యం పెట్టి వృద్ద బ్రాహ్మణుల దంపతులను బోజనానికి పిలిచి ముందుగా చిత్రానాన్ని వడ్డించి భోజనం తరువాత పండ్ల దక్షిణతో కలిపి తాంభులాన్ని అందించి నమస్కరించు కొంటే మీ దాంపత్యంలో వచ్చిన అన్ని కలహాలు ,పట్టు విడుపులు అన్ని త్వరగా తొలగిపోయి సంసారంలో సుఖo శాంతి ఎప్పటికి నెలకొని ఉంటుంది
చిత్రానాన్ని మంగళవారం సాయంత్రం చేసి శ్రీ దుర్గాదేవికి ,చౌడేశ్వరి దేవి తదితర శక్తీ దేవతలకు నైవేద్య్యం పెట్టి తరువాత సుమంగళిలకు మాత్రమే పంచాలి .పెళ్లియిన ఆడవాళ్ళు ,రజస్వల అయిన ఆడవాళ్ళు పిల్లలు ఉన్న మహిళలకు మాత్రమే చిత్రానాన్ని దానం చేస్తే కుజ దోషాలు నివారణ అవుతాయి కుజ దోషం ఉన్నావారు పూజ చేసిన రోజు మాత్రం చిత్రాన్నని తినకూడదు .ఈ రకంగా చేస్తే దోషాలు తొలగి త్వరగా వివాహం అవుతుంది
చిత్రన్నని ధనుర్మాసంలో దేవుని సేవలు చేయిoచేవారు .ఆడవాళ్లు అయెతే దేవాలయంల్లో పూజలు చేయిoఛి ,ప్రసాదాన్ని పంచి తాము కుడా తేంటే ఇంటి యజమానికి అన్ని రకాల వ్యాధులు తొలగి ఆ మహిళా ఎప్పుడు సుమంగళిగా ఉంటుంది
చిత్రన్నని ధనుర్మాసంల్లో దేవుని సేవలు చేయిoచేవారు ,మగవారుఅయెతే దేవాలయంలో పూజలు చేయిoఛి ,ప్రసాదాన్ని పంచి తాము కుడా తెంటే ఇంట్లోనివారికి అంటే భార్య ,పిల్లలకు అన్ని రకాల వ్యాధులు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు
పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఆడపిల్లలు,మగ పిల్లలు పెళ్లి చేసేoదుకు ఎంత ప్రయతించిన వివాహం కాకపోతే మీ ఇంట్లో జరిగే శుభ కార్యాలలో లేదా మీ బంధువుల ,స్నేహితుల ,మిత్రువుల ఇళ్ళలో జరిగే శుభ కార్యాలలో అంటే పండుగ ,పెళ్లి ,దేవతా కార్యాలు ,శ్రీ సత్యనారాయణ వ్రతం తదితర కార్యాలలో భోజనం చేసే వారికీ ,పెళ్ళికానీ వారు అందరికి చిత్రన్నని వడ్డిస్తి వివాహానికి ఉన్న అడ్డంకులు ,దోషాలన్నీ నివారణఅయి చాలా త్వరగా వివాహం నిశ్చయం అవుతుంది .ఇటువంటి సందర్బాలలో పెళ్లి కావాలనుకొనే వారు చిత్రాన్నని వడ్డీoచినవారు మాత్రం ఆ రోజు చిత్రానాన్ని తినకూడదు
పసుపు చిత్రాన్నం
ప్రతి సంవస్థారం కామేర్ర్ల వ్యాధితో సమస్స్యలు అనుభవించేవారు .ఎ దేవికి పసుపు రంగు చిత్రానాన్ని నైవేద్య్యంగా పెట్టి అందరికి పంచి లెదా దానంగా ఇస్తే ఆరోగ్యవంతులు అవుతారు .మరియు కామేర్ర్ల వ్యాధి ధరిచేరదు
నువ్వుల పొడి చిత్రానాన్ని
ఎవరికీ దేహంలో బాగా నీరసంగా ఉంటుందో
ఎవరికీ నడుము నొప్పి వస్తుoటుందో
ఎవరికీ కడుపు నొప్పి పదే పదే వస్తుoటుందో
ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు,ఎముకుల సమస్స్యలు ఎదుకొoటుటారో
ఎవరికైతే ప్రతి రాత్త్రి చెడ్డ కలలు వస్తుంటాయో
ఎవరి జేవితంలో ఎక్కువ కష్టాన్ని అనుభావిస్తుంటారో
ఎవరి జేవితంలో చాల పనులు నిధానంగా అవుతుoటయో
ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైతే భయపడుతుంటారో
ఎవరైతే ఎప్పుడు నిద్రపోతుంటారో
ఈ సమస్యలు ఉన్నవారు శనివారం రోజు దేవునికి నువ్వుల పొడి చిత్రానాన్ని చేయిoఛి తమ కుల దేవతలకు పూజ చేయిoఛి నువ్వుల పొడి చిత్రానాన్ని నైవేద్య్యంగా చేసి అందరికి పంచితే వారి పనులుఅన్ని పూర్తి అవుతాయి
పెసరు పప్పు పొంగలి
విద్యార్ది ,విద్యార్దినులు చదివే సమయంలో చాలా నిద్ర వస్తుంటి
ఎ విద్యార్ది ,విద్యార్దినులు చదేవే సమయంలో చాల శ్రమకు గురిఅవుతుంటారో
ఎవరికైనా సరి చదివింది మరిచి పోతుంటే
ఎవరికైనా సరే బాగా చదివింది పరీక్షా సమయములో మరిచి పోతుంటే
ఎవరికైనా సరే కోపం ,చికాకు ఎక్కువుగా వస్తుంటే
భార్య,భర్తల మధ్య మాటమాటకు ఎప్పుడు గొడవలు జరుగుతుంటే
నరాల సామర్ధ్యం శక్తీ హీనం అయెతే ....
పిల్లలు ఎదిగేoదుకు ఏమైనా సమస్యలు ఉంటె
పిల్లలు,పెద్దలు చాల హట్టవాదులుగా మారితే ...
పెళ్లి సమయములో స్త్రీ ,పురుషులు తాము ఇష్టపడిన వారినే పెళ్లిచేసుకొంటమని పట్టుపడితే ...
ఇలాంటి సమస్యలను,ఇబ్బందులను ఎదుర్కొనేవారు ప్రతి బుదవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పెసరపప్పు పొంగలి చేసే ,లేదా చేయిoఛి విష్ణు సహస్రనామం ,శ్రీ మహాలక్ష్మి సహస్రనామం చెప్పి ,పొంగలి నైవేద్య్యంని పెట్టి వృద్ద బ్రాహ్మణా దంపతులకు తాoభూలంతో కలిపి దానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి .మీరు చేపట్టిన ప్రతి పనిలో నానాటికి లాభాన్ని ,జయాన్ని ,సంసారంలో సుఖం చూస్తారు
పెసర పప్పు పొంగలిని ఎ దేవునికి నైవేద్య్యంగా పెట్టాలి
పొంగలిని శ్రీ సూర్య నారాయణ దేవునికి నైవేద్య్యంగా పెడితే మీ కంటి దోషాలు,హృదయానికి సంభందించిన వ్యాధులు ,చర్మ వ్యాధులు త్వరగా నయం అవుతాయి
శ్రీ దుర్గ దేవికి పూజ చేసి పొంగలిని నైవేద్య్యంగా పెడితే ఇంట్లో టెన్షన్ ,స్ట్రెస్ ,మెంటల్ వర్రీస్ ,హైబిపి ,అంతర్గత గొడవలు ,మహిళలకు సంభందించిన వ్యాధులు ,రజస్వల రోగాలు ,గర్బకోస రోగాలు ,ఉదర సంభందిత సమస్యలు చాల త్వరగా తగ్గి పోతాయి
శ్రీ మహాగానపతికి పొంగలి నైవేద్య్యంగా పెడితే మీ అన్ని పనులు సులభంగా జరిగిపోతాయి
శ్రీ; సుబ్రమన్యస్వామికి పొంగలి నైవేద్య్యంగా పెడితే భర్త ,భార్య ,పిల్లల మధ్య ఉండే గొడవలు నిలిచిపోతాయి
శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి పొంగలి నైవేద్య్యంగా పెట్టి పూజ చేసే వారి అన్ని పాపాలు తొలగి దేవునిఫై భక్తి పెరుగుతుంది .తలచిన పనులు నెరవేరుతాయి
శ్రీ బుదగ్రహానికి పెసరపప్పు పొంగలి నైవేద్య్యగా చేసి ప్రసాదాన్ని పంచి వారు కూడా తెంటే జ్ఞాపక శక్తీ వృద్ది చేoదుతుంది
శ్రీ సరస్వతి దేవికి పొంగలి నైవేద్య్యం చేసి పిల్లలకు పంచి తాము కూడా తెంటే విద్యభాసంలో ఎటువంటి సమస్యలు లేకుండ ,ఉత్తమ జ్ఞాపక శక్తితో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు
రాధా కృష్ణ దేవునికి పొంగలి నైవేద్య్యంగా పెట్టి పశువులకు ,లేగ దూడలకు ప్రసాదం పెట్టి మరియు తాగేందుకు నీటిని ఇచ్చి తాముకూడా ప్రసాదాన్ని తెంటే వివాహసమయంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి
శ్రీ సత్యనారాయణ దేవునికి పొంగలి నైవేద్య్యం పెడితే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి
శ్రీ మహాలక్ష్మి దేవికి పొంగలి నైవేద్య్యoగా సుమంగళిలకు పానకం ,తాoభులంతో దానం చేస్తే రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది
బిసి బెళేబాత్
బిసి బెళేబాతును ప్రత్రుంగి ఇది కర్ణాటక ప్రాంతంలో వండే అన్న విశేషం .దేవికి నైవేద్య్యంగా పెడితే మీకు మీ ఇంటిలోని వారికీ శత్రువుల నివారణ ,మాంత్రిక దోషాలు ,శత్రువుల దోషం తొలగిపోతుంది
శక్తీ దేవతలకు బిసిబిళబాత్ ను నైవేద్య్యంగా పెడితే మీ పనులు ,రాజస ,తామస వృతుల్లో ఉండే వారి పనులు త్వరగా జరిగిపోతయి
మాటమాటకు కోపగించుకొనే వారికీ ,కోపంతో మాట్లాడేవారు ,ఇంట్లో ప్రశాంతంగా ఉండి బయటకు రాగానే గొడవ చేసివారు ,రక్తపోటు ఎక్కువగా ఉండేవారు .తదితరలు తమ కులదేవతకు బిసి బిళబాత్ నైవేద్య్యంగా పెట్టి తాము కూడా తినకుండా వేరే వారికీ ఇచ్చి వేయాలి .ఈ రకంగా మూడు ,లేదా ఐదు మంగళవారలు చేస్తే ఇంట్లో శాంతి ,ప్రశాంతత ,మనస్సుకు హాయిగా ఉంటుంది .బంధువుల్లో ,మిత్రువుల్లో ప్రేమ ,విశ్వాసం,శాంతి ,సంతోషం పెరిగి సుఖoగా ఉండే అవకాశం ఉంటుంది
రాహుకాలంలో పూజలు చేసీవారు ,పూజ చేయిoచే వారు ,శక్తీ దేవతలను పూజించేవారు ,ఉగ్ర నరసింహుని పూజించేవారు ,పంచముఖ ఆంజనేయని పూజించేవారు శ్రీ దేవి కాళిక మాతను పూజించేవారు ఈ దేవుళ్ళకు బిసి బిళబాత్తో పాటు పానకం ,వడపప్పు ,పెరుగన్నం చేయిoఛి దేవుళ్ళకు నైవేద్య్యంగా పెట్టి ,ఈ నైవేద్య్య ప్రసాదాన్ని పంచి ,మీకు ,మీ ఇంటివారికి మీ వంశంలో ఏదైనా కారణానికి దైవ శాపాలు ,సుమంగళి శాపాలు ,మహిళల శాపాలు ఉంటె తొలగిపోతాయి .ఇంట్లో ఎప్పుడు సుఖం ,సంతోషం ,భాగ్యాలు ఎక్కువ అవుతాయి
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కానీ ,శ్రీ శంకర మఠంలో గాని బిసి బిళబాత్ ను ,పెరుగన్నంను చేసి లేదా చేయిoఛి శ్రీ గురుదేవులకు నైవేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని పంచితే ,త్రాగేందుకు నీటిని ఇస్తే మీ మనస్సుకు శాంతి మరియు కోరుకొన్న కార్యాలు త్వరగా ఆయె విజయాన్ని లాభాన్ని పొందుతారు
క్రొత్తగా వివాహం ఆయెన అమ్మాయి భర్త ఇంట్లో వదిలి వచ్చీ సమయంలో బిసి బిళబాత్ కానీ ఏదైనా కారాబాత్ లాంటి తిండిని ఇవ్వవద్దు.ఒక వేళ ఇస్తే పెళ్లియినా తరువాత పెళ్లి కూతురికి అత్తిoటి వారికీ గొడవలు జరుగుతాయి .అందుకే పెళ్ళికి కావలసిన అమ్మాయికి తీపి పదార్దాలు ఇస్తే అత్తిoటి వారు చాల బాగా చూసుకొంటారు .అమ్మాయి ,అత్త ఇంట్లో బాగా బతుకుతుంది .పెళ్లియిన తరువాత అత్తకోడళ్ళు తల్లికూతుళ్ళ వాలే కలసిపోతారు.
అటుకుల అన్నం
శ్రీ కృషునికి సాయంకాలం అటుకుల అన్నం ,బెల్లం ,కొబ్బరితురుమును వేసి నైవేద్య్యంగా పెడితే దానిని తేనేoదుకు పిల్లలకు ఇచ్చి మీరు కూడా ప్రసాదంగా తెంటే మీ జీవితంలో ఎప్పుడు అప్పుల బాధ ఉండదు .ఇంట్లో భాగ్యం పెరుగుతుంది .ఇంట్లోని వారందరు సుఖంగా ఉంటారు .పనులు సులభంగా జరుగుతాయి .ఇంట్లోని మహిళలకు ఆరోగ్యం భాగుంటుంది .పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు
తీపి అటుకుల అన్నానికి తేనేను వేసి కలిసి శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి నైవేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని పంచి ఇంట్లోని వారందరు తెంటే అప్పుల భాద నుంచి విముక్తి పొందుతారు .ఆదాయం అధికంగా ఉండి ఖర్చు తగ్గి పోతుంది .ఎక్కువ డబ్బు మిగులుపోతుంది
తీపి అటుకుల అన్నానికి తేనేను అరటికాయను వేసి కలిపి శ్రీ పార్వతిపరమేశ్వరులకు నైవేద్య్యంగా పెట్టి బ్రాహ్మణ దంపతులకు తాంభులన్ని దానంగా ఇచ్చి ఆవుకి ప్రసాదాన్ని పెట్టి పెళ్ళికాని అబ్బాయి ,అమ్మాయిలకు ఇస్తే త్వరగా వివాహం అయి సుఖమయ దాంపత్య జీవితం గడుపుతారు
వ్యాపారం చేసి సమయంలో ప్రతి రోజు వ్యాపారంలో తక్కువ లాభం వస్తుంటే ....వ్యాపారం తగ్గిపోతుంటే
జనాలు వ్యాపారస్తుల అంగడికి దగ్గరికి రాకుండా పొతే
వ్యాపారంలో నష్టం వస్తుంటే
వ్యాపారం జరగకూడదని ఎవరైనా మంత్రిస్తే
వ్యాపారం చేసేoదుకు వచ్చేవారు అంగడికి వచ్చి వస్తువుల ధరలను అడిగి కొనుగోలు చేయకుండా వేనుదేరిగితే
వ్యాపార స్తలంలో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే
వ్యాపారస్తాలంలో దుకాణం యజమానికి నిద్ర ,ఆయాసం కలుగుతుంటే ...
వ్యాపారం కోసం తెచ్చిన సరుకు ఎన్ని రోజులు ఆయెన అమ్ముడు కాకపోతే ..
వ్యాపారం అవదు అని చితించి అనవసరంగా ఆలోచిస్తుంటే ..
వ్యాపారం కాదని నమ్మి అంగడిని అమ్మాలని ఆలోచిస్తుంటే
ఈ ఫైనా తెలిపిన కారణాలతో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అటువంటి వారు దుకాణంలో సోమవారం ,గురువారం ,శుక్రవారాలు సాయంత్రం అంగడిని శుబ్రాపరిచి పుణ్యహో వాచనం చేసి ధనలక్ష్మి పూజను కళ దేవతల ధన ,ఆకర్షణ దేవతల మూల మంత్రాన్ని దేవుని చిత్రపటానికి నగదు పెట్టకు ఆవాహన చేయిoఛి అంగడిలో గుగుళ్ళ ధుపాన్ని వేసి వరి కంకులు ,తెల్లని అవాలతో దిష్ట్టి మంత్రాన్ని చెప్పి దుకాణం ఎనిమిది మూలలకు వేసి గుమ్మడి కాయతో దిష్ట్టి తేసి అటుకులను బెల్లం ,కొబ్బరి తీపి భూoధీ ,పచ్చకర్పూరం ,పన్నీరు ,కుoకుమ పువ్వు చేసి కళదేవతలు ,శ్రీమహాలక్ష్మి దేవికి నైవేద్య్యం పెట్టాలి .తరువాత తెల్లని ఆవాలు ,వరి కంకులతో అంగడికి దిష్టి తీసి నీటిలో ముంచి ప్రసాదాన్ని దుకాణం యజమాని ఇంటివారు తేoటె దుకాణంలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి .దుకాణంలో చాల బాగా వ్యాపారం జరిగి చాల లాభం పొంది ఇంటి వారంతా సంతోషంగా ఉంటారు
ప్రతీ శనివారం శ్రీరామ మందిరంలో శ్రీ సీతారామ భజన తరువాత శ్రీ రామమందిరంలో ఉండే దేవతలందరికీ నైవేద్య్యంగా పెట్టిన పదార్ధాలు అటుకులు ,బెల్లం ,పటిక బెల్లం ,తేనే ,మామిడి రసం వేసి బాగా కలిపి తేoటె మీ దాంపత్య జీవితంలో ఉండే గొడవలు ,బిన్నాభిప్రాయలు తొలగిపోతాయి .అవమానాలు పరిహారం అవుతాయి .మరియు దాంపత్య జీవితంలో అనురాగం ,ప్రేమ ,ప్రేతి ఎక్కువ అవుతాయి
ఇదే ప్రసాదాన్ని అన్నదమ్ములు ,అక్కాచెల్లల్లు పంచి తెంటే వారి మధ్య ఉండే గొడవలు పరిహరిం అయి జీవితంలో సుఖంగా ఉంటారు అక్కా చెల్లలు ,అన్నదమ్ముల మద్య గొడవలు లేక ప్రేమ విశ్వాసాలు ఉంటయి .ఇదే ప్రసాదాన్ని సుమంగళిలు చేసి పంచితే జీవితం పూర్తిగా సుమంగళిలుగా ఉంటారు
ఇదే ప్రసాదాన్ని పెళ్లి కావలసిన' అమ్మాయులు అబ్బయలు శ్రీ మహాగణపతికి నైవేద్య్యంగా పెట్టి ప్రసాదం పంచి తీoటే త్వరలో వారికీ వివాహ దోషాలు తొలగి వివాహం సంతోషాల మధ్య జరుగుతుంది
ప్రతి గురువారం రాత్రి అరటి పండు ,అటుకులు ,బెల్లంతో కలిపి శ్రీ గురువులకు నైవేద్య్యంగా పెట్టి ప్రసాదంగా తీoటే శ్రీ గురువుల గృహ దేవతల శాపాలు తొలగిపోతాయి
ప్రతి మంగళవారం దేవి పూజ చేస్తే పూజకు అటుకులు ,పొంగలి నైవేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తే మీ వంశం త్వరగా వృద్ది చెందుతుంది
ప్రతి బుదవారం శ్రీ విష్ణు సహస్రనామం శ్రీ లక్ష్మి సహస్రనామం పారాయణ చేసి పాలను అటుకులను వేసి నానబెట్టి కొబ్బరి బెల్లాన్ని వేసి నైవేద్య్యం పెడితే మీ పనులుఅన్ని జరిగి అన్ని కష్టాలు పరిహారం అవుతాయి
కారం అటుకులు
కారం అటుకులను దానం చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుంది ?.ఇటువంటి నైవేద్య్యం ఎ సమయంలో చేయాలి?ఎందుకు చేయాలి
ఇంట్లో భార్య భర్తలు ,తల్లి ,తండ్రి ,ఎప్పుడు గోడవ పడుతుంటే
ఎవరికైతే వయస్సుకు మించిన కోపం ,చిరాకు వస్తుoటుoధో
ఎవరింట్లో అయితే కాంతి ఉండదో
ఎవరైతే చేసి పనుల్లో ,చెప్పే పనుల్లో వినే సమయంలో గొణుగుతూ చేస్తూoటారో
ఎవరైతే ఎక్కువ రక్తపోటుతో ఇబ్బందులు పడుతుంటారో
ఎవరైతే మాట్లాడే సమయంలో వణుకుతుంటారో ...
ఎవరైతే మాట్లాడే సమయంలో నత్తి నత్తిగా మాట్లాడుతుంటారో
ఎవరైతే పడుకున్న సమయంలో ఎక్కువుగా మాట్లాడుతుంటారో
ఇంట్లో బయపడుతూ ఉండి బయట ధైర్య్యంగా ఉంటారో
ఎవరైతే మాట్లాడే సమయంలో ఫైన పెదవి అదురుతుంటారో
ఫైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు కారం అటుకులను తాoభులంతో ఉంచి దానం చేస్తే మనసుకు చాలా శాంతి లబిస్తుంది .అన్ని పనులు త్వరగా నెరవేరుతాయి
అటుకులను కూరగాయ రసంలో కలిపి మీరు పూజను చేసిన తరువాత దానం చేస్తే మీకు ఉన్న రక్తపోటు ,కోపం త్వరగా తగ్గిపోతాయి
అటుకులను దంచి కారం ఉన్న మిరపకాయ రసంలో కలిపి క్షుద్ర దేవతలకు నైవేద్య్యం చేసి దానం చేస్తే మీలో ఉన్న రజోగుణం ,తమోగుణం త్వరగా వదిలి వెళ్ళతాయి
పుల్లని అటుకులు
ఎవరింట్లో అయతే పెద్దల శాపం ఉంటుంధో
ఎవరింట్లో అయెతే స్త్రీల శాపం ఉంటుందో
ఎవరింట్లో అయెతే బ్రాహ్మణుల శాపం ఉంటుందో
ఎవరింట్లో అయెతే అర్థ వయస్సులోనే మృతి చెందుతూ ఉంటారో
ఎవరింట్లో అయెతే సుమంగళిలు వితంతువులు అవుతుంటారో
ఎవరింట్లో అయెతే అభివృద్ది లేకుండా ఉంటుందో
ఎవరైతే బాణమతి ,చిల్లంగి ,మంత్రం తదితర సమస్యలలో ఇబ్బందులు ఎదుర్కొంటారో
ఎవరింట్లో అయెతే అబ్బాయి ,అమ్మాయిలకు వివాహం వయస్సు వచ్చిన తరువాత తమ కులం ఆచారాన్ని వదిలి అన్య కుల అబ్బాయి అమ్మాయిలను వివాహం చేసుకోనేoదుకు ఇష్టపడుతుంటారో
వివాహం అయిన తరువాత అబ్బాయులు తమ తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టుoదుకు ఆసక్తి చూపుతుంటారో
ఎవరింట్లో అయితే వివాహానికి సిద్దంగా ఆడపిల్లలు ఉండి వారికీ వివాహం చేయకుండా అబ్బాయులుకు పెళ్ళి చేస్తారో ..చేసుకొంటారో
అమ్మయులుకు వయస్సు వచ్చినప్పిటికి ఎవరింట్లో అయితే పెద్దలు వివాహం చేయారో ..
వయస్సు వచ్చిన అమ్మయులుకు ఇష్టంలేని వరునితో వివాహం చేయిస్తే
అమ్మాయి కన్నా వరునికి 10 నుంచి 12 సంవస్థరాల వయసు ఎక్కువుగా ఉంటి....
పెళ్లిఅయిన కొన్ని రోజులకే వరుడు లేదా వధువు మృతి చెందితే ...
చిన్న వయస్సు ఉన్న అమ్మాయికి వయస్సు ముదిరిన వరునితో వివాహం జరిగితే ...
ప్రధమ వివాహానికి ఉన్న వధువుకి రెండోవ వివాహానికి సిద్దంగా ఉన్న వరునితో వివాహం జరిగితే ...
ఇటువంటివే తదితర కారణాలతో వచ్చే మహా పాపాల విముక్తికి దోష పరిహారం చేయిoచేoదుకు.....
ఈ సమస్యలు ఎవరైతే అనుభవిస్తుంటారో లేదా జరుగుతుంటయో అటువంటివారు ప్రతి సోమవారంనాడు శత రుద్రాభిషేఖన్ని చేసి పాలు తేనేతో శివునికి అభిషేఖం చేయిoఛి పుల్లని అటుకులు ,రసాయనం ,శాల్ల్యాన్నం తదితరాలను నైవేద్య్యం చేసి ఆవులకు ,దూడలకు గోపూజ చేసే ,బ్రాహ్మణులకు పూజ ,సుమంగళిల పూజ భోజన వ్యవస్తను చేసి పుల్లని అటుకులను దానం చేస్తు వస్తే ఈ దోషాలు చాల త్వరగా తగ్గిపోతాయి .ఇంట్లో శుభకార్యాలు జరిగి చాల వేగంగా అన్ని రకాల శాపాల నుంచి విముక్తి పొందవచ్చు
పుల్లని అటుకులను ఎప్పుడు దానం చేయాలి
ఏ హోమంలోనైన దేవునికి నైవేద్య్యంగా ఉంచిన పుల్లని అటుకులను దానం చేయాలి
శివరాత్రి రోజు-శ్రీ పార్వతి ,పరమేశ్వరులకు పుల్లని అటుకులు నైవేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని తేoటె మీ కుల దేవత శాపాలు బాగా త్వరగా నివారణ అవుతాయి
శ్రీ రామ నవమి రోజు శ్రీ సీతరామచంద్రులుకి పుల్లని అటుకులను ,పాలు ,అన్నం ,పండ్లు ,కొబ్బరికాయ ,పానకం ,వడపప్పు తదితరాలను నైవేద్య్యంగా పెట్టి గృహస్తులకు మరియు సుమంగళిలకు దానం చేస్తూ వస్తే అన్ని దోషాలు చాల త్వరగా నివారణ అవుతాయి
ప్రతి ద్వాదశి రోజు శ్రీ విష్ణు సహస్రనామం శ్రీ లక్ష్మి సహస్ర నామ పారాయణన్ని చేసే పుల్లని అటుకులను ,పళ్ళ రసాయనాన్ని నైవేద్య్యంగా పెట్టి ఆవు ,దూడలకు పూజ తరువాత గోగ్రాసాన్ని ఇవ్వాలి అటుఫైన బ్రాహ్మణులకు మరియు సుమంగళిలకు తాంభులా దానాన్ని పుల్లని అటుకులను దానం చేస్తే వుంటే మీ పనులన్నీ నెరవేరుతాయి .పానకం వడ పప్పు దానం చేయాటం ద్వార మీ ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది
కార్తిక మాసం ,శుక్ల పక్షం ద్వాదశి (తులసి పండుగ రోజు ) ఎవరైతే సాయంకాలం తులసి పూజను చేసి దేవునికి పుల్లని అటుకులను నైవేద్య్యం పెట్టి ప్రసాదాన్ని అందరికి పంచి ,ప్రసాదాన్ని తింటారో వారికీ ఒక సంవస్తారంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి
ప్రతి నెల పూర్ణిమ రోజు మీ ఇంటి దేవునికి అటుకుల అన్నని నైవేద్య్యంగా పెట్టి దానం చేసినా మీ సమస్త పనులన్నీ చక్కగా నెరవేరుతాయి
మంత్రం శాస్త్రంలో ఒక విషయం ఉంది .ఎవరైతే పుల్లని అటుకులను తింటారో వారిఫై ఎటువంటి దుష్టశక్తులు మంత్రాలు పనిచేయవు
శుక్రవారం మరియు శనివారం పుల్లని అటుకులను దానం చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వృద్ది చెందుతాయి
తెల్లని అన్నం
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు నగదుకు ఇబ్బందులు ఎదురుకావు .ఎంత పేదరికం ఉన్న త్వరలోనే శ్రీమంతులు అవుతారు
ఎవరైతే తెల్లని అన్నానికి తేనను కలిపి దాన్ని నైవేద్య్యంగా ఉంచుతారో వారికీ అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి
ఎవరైతే తెల్లని అన్నానికి తేనేను ,పంచదారను ,కొబ్బరిని కలిపి ఆ అన్నని కులదేవతకు నైవేద్య్యంగా ఉంచి అన్నాదనాన్ని చేస్తారో వారికీ అన్ని రకాల రోగాలు నయం అవుతాయి
ఉష్త్త్నసంభదిత వ్యాధులు ఉంటె ఆదివారం చేయలి
శీత సంభందిత వ్యాధులు ఉంటి సోమవారం చేయలి
రక్తానికి ,రక్తపోటుకు సంబందించిన వ్యాధులు ఉంటె మంగళవారం చేయలి
బుద్దికి ,నరాలకు సంభందించిన వ్యాధులు ఉంటి బుధవారం చేయలి
అన్ని రకాల ఉదర సంభంద వ్యాధులు ఉంటె గురువారం చేయలి
ముత్రకోశ రోగాలు ,మూత్ర పిండాల సమస్య ,డయాలసిస్ ,మూత్రపిండల్లో రాళ్ళూ తదితరాలు ఉంటె శుక్రవారం చేయండి
మనసుకు ,చిత్తనికి శాంతి కలిగేందుకు ,శాంతి లబించేoదుకు బుధవారం చేయలి
మంచి జ్ఞాపకశక్తి పొందేందుకు పుణ్యక్షేత్రాల్లో దర్శనం ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయలి .చాల మంచి జరుగుతుంది
తెల్ల అన్నం ,శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్య్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరు ప్రేమ,అభిమానాలను కలిగి ఉంటారు .చాల వరుకు శాంతి లబిస్తుంది .మనస్సులో ఉండే భయం ,బీతి ,బెదిరింపులు అన్ని తొలగిపోతాయి
తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చురునికి నైవేద్య్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృ దేవతలా శాపాలన్ని తొలగిపోతాయి
అన్నని దేవునికి నైవేద్య్యంగా పెట్టి దాన్ని పశువుల తినేoదుకు ప్రసాదాన్ని ఇచ్చి ,అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది
సరిగా అన్నం తినని వారికీ తెల్ల అన్నం పసుపు ,కుంకుమ కలిపి పూజ చేసే దిష్టి తీసి మూడుదార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి ఆయెన తొలగిపోతుంది
అన్నదానం ప్రతేక ఫలాలు
అన్నంతో పాటు మోదక దానాన్ని చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్న పరిహారం అవుతాయి .పనిలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి .దానాన్ని మాత్రం దైవభక్తులకు తాంభులంతో పాటు దక్షిణ ఉంచి దంపతులకు ఇవ్వాలి
ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువుగా ఉన్నావారు అన్నంలో నేయి వేసి లేదా నేతి అన్నంతో లడ్డు పెట్టి తాంభులం దానం చేస్తే మీ జీవితంలో అధిక ఆదాయం సంపాదన కలగటంతో పాటు శ్రీమంతులుగా మారిపోతారు
చాల రోజులుగా రోగాలు అనుభవిస్తున్నవారు నేతి అన్నంతో దానం చేసి దేవునికి తలనీలాలు సమర్పిస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యమంతులుగా మరుతారు
చిత్రన్నంతో పాటు వడ దానం చేస్తే మీ ఇంట్లోఫై జరుగుతున్నా అన్ని మాంత్రిక దోషాలు తొలగిపోతాయి
నేతి అన్నంతో పాటు పెనిలు దానం చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి
బెల్లం అన్నం దానం చేస్తే మీరు శ్రీమంతులు అవుతారు
No comments:
Post a Comment